హత్య చేసి దర్జాగా తిరుగుతున్నాడు.. పోలీసులు దొరకడం లేదంటున్నారు..

By Ravi
On
హత్య చేసి దర్జాగా తిరుగుతున్నాడు.. పోలీసులు దొరకడం లేదంటున్నారు..

  • కేసు నమోదుకే పరిమితం అయిందని బాధితుల ఆరోపణ
  • నిందితుడిని అరెస్ట్ చేయాలని అపార్ట్మెంట్ వాసుల డిమాండ్
  • వివరాలు గోప్యంగా ఉంచుతున్న పోలీసులంటూ మండిపాటు

అపార్ట్మెంట్ లో  హత్య జరిగి వారం దాటినా నేటి వరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేయడం లేదని సదరు అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 
అపార్ట్ మెంట్ కు గత కొన్నేళ్లుగా అధ్యక్షుడుగా పని చేస్తున్న వ్యక్తిని వేరేవారి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తి కొట్టి చంపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం ఏమిటని అపార్ట్మెంట్ వాసులు పోలీసులు ప్రశ్నించారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ మారుతినగర్ రోడ్ నంబర్ 5 లోని న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఫ్లాట్ నంబర్ 204 లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి అన్నపూర్ణ దంపతులు గత 13 ఏండ్లుగా నివాసం ఉంటున్నారు. నాగిరెడ్డి అపార్ట్మెంట్ కు అధ్యక్షులుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా రాజమండ్రికీ చెందిన కామాక్షేశ్వరి నాలుగో అంతస్తులో అద్దెకు ఉంటుంది. ఈ నెల 21 న తన కుమార్తెతో కలిసి అల్లుడు జవ్వాజి కృష్ణ కామాక్షేశ్వరి ఇంటికి రావడం జరిగింది. కృష్ణ తన కారును అపార్ట్మెంట్ బయట పార్క్ చేసాడు. 
కొద్దిసేపటి తర్వాత వెనకాల నాగిరెడ్డి తన కారును పార్కింగ్ చేయగా కృష్ణ కారు తీసే క్రమంలో నా కారుకు వెనక ఉన్న కారు తగిలిందని వాచ్ మెన్ తో నాగిరెడ్డిని పిలిపించి గొడవకు దిగాడు. మాటమాట పెరిగి కృష్ణ నాగిరెడ్డిని తీవ్రంగా గాయపరిచాడు. చెవి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది. నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ, అపార్ట్మెంట్ కార్యదర్శి వల్లకొండ చంద్రకాంత్, గిరిధర్, నాగరాజు కిందకు వచ్చి కృష్ణను అడ్డగించారు.
నాగిరెడ్డిని వెంటనే సమీపంలోని ఓమిని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు చేయగా సిఐ వెంకటేశ్వర్ రావు తన సిబ్బందితో కలిసి పంచనామా చేసి పోస్టుమార్టం చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేసారని తెలిపారు. కానీ ఆకారణంగా నాగిరెడ్డిని కొట్టి చంపిన నిందితుడు కృష్ణను నేటివరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను వారు ప్రశ్నించారు. 
నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని న్యాయం చేయడం లేదని వాపోయారు. 
సిసి కెమెరాలు పరిశీంచిన పోలీసులు వాస్తవం తెలిసినా గాని అరెస్ట్ విషయంలో తాత్సారం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర రావును వివరణ కోరగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు.

Advertisement

Latest News

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
ఇక తగ్గేదే లే.. జగడమే..
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..