రైతుల కష్టం.. వర్షంతో నష్టం..

By Ravi
On
రైతుల కష్టం.. వర్షంతో నష్టం..

తాండూర్: నియోజకవర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నెలలు గడుస్తున్నా  ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సెంటర్ లో ఉన్న వరి ధాన్యం మొత్తం మొలికెత్తి, రైతుల పాట్లు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలం ముకుందాపూర్ ఐకెపి సెంటర్లో పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 
 యాలాల్ మండలం పరిధిలోని ముకుందాపూర్ గ్రామంలో గత నెల రోజుల క్రితం వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఐకేపీ సెంటర్ ని ఏర్పాటు చేసింది. రైతులు పండించిన వరి ధాన్యం సుమారు 5000 క్వింటాలు కొనుగోలు కేంద్రానికి తరలించారు. అయితే సెంటర్లలో తూకాలు చేయకపోవడం లారీల నుండి ధాన్యాన్ని తరలించకుండా ప్రభుత్వం విఫలమైంది. దీంతో అకాల వర్షం కురుస్తున్న సెంటర్లో సరైన వసతులు లేక నిల్వ ఉంచిన దాన్యం మొత్తం మొలకెత్తాయి. గత నెల రోజుల్లో నుండి ధాన్యాన్ని సెంటర్ కు తీసుకొని వచ్చిన కూడా ఇంతవరకు , తరలించకపోవడంతో తమ ధాన్యం పూర్తిగా మొలకెత్తడంతో కొనేవారు లేరని కన్నీటి పర్యంతం అయ్యారు. ఏళ్ల తరబడి పడిన కష్టం వృధా అయ్యిందని, చేతగాని ప్రభుత్వం తమ జీవితాలు రోడ్డున పడేసింది అన్నారు. ఇక తమకు చావేగతన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్తులో రైతులు కనిపించకుండా పోతారని వాపోయారు.

Advertisement

Latest News