ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..

By Ravi
On
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే వ్యక్తి, దరఖాస్తు చేసుకున్నా కూడా తనకు ఇల్లు మంజూరు చేయలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పి, తరువాత ఇల్లు రాలేదని చెప్పడంతో అశోక్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడని తెలిపిన గ్రామస్తులు  తెలిపారు. చేతిపై సూసైడ్  కారణం రాసి ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. అశోక్ మృతికి ప్రభుత్వమే కారణమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామపంచాయితీ ముందు మృతదేహంతో బైఠాయించి ఆందోళనకు దిగారు. అశోక్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, అతని కుటుంబానికి ఎకరం భూమి, కుమార్తెలకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని  గ్రామస్తులు డిమాండ్ చేశారు. అశోక్ ఆత్మహత్యతో టెన్షన్ వాతావరణం నెలకొంది.IMG-20250530-WA0001

Advertisement

Latest News

ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం.. ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్‌ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్‌ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..
అక్షయ విద్య ఫౌండేషన్ ను అభినందించిన డీజీపీ జితేందర్..
దాడులతో దడపుట్టిస్తున్న ఎక్సైజ్ టీమ్స్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం.
ఇక తగ్గేదే లే.. జగడమే..
సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
తూంకుంటలో హైడ్రా కూల్చివేతలు..