నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..

By Ravi
On
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలే మాకు ముఖ్యం. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి..

తాండూరు: 20250529_204316చదువుకున్న ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించాలన్నదే తన లక్ష్యం అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) సహాకారంతో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించి మేగా జాబ్ బేళా రికార్డు స్థాయిలో విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, స్టేట్ ఫైనాన్స్ కమీషన్ మెంబర్ ఎం. రమేష్ మహరాజ్, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, పార్టీ నేతలు, ఈజీఎంఎం ప్రతినిధులు, అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. యువత జాబ్ మేళాలో అందివచ్చిన అవకాశాలను సద్వనియోగం చేసుకోవాలన్నారు. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు భారంగా కాకుండా ఉద్యోగాలు పొంది కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, పలు శాఖల అధికారులు మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన జాబ్ మేళా అభినంద నీయమన్నారు. యువకులు ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ అంజయ్య, బషీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ మాధవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు విఠల్ నాయక్, వడ్డె శ్రీనివాస్, గాజీపూర్ నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, కోట్ పల్లి మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, నాయకులు బంటు మల్లప్ప, మహిపాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, లొంక నర్సింలు, భీమయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, పలు శాఖల అధికారులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్

పట్టణంలోని వినాయక కన్వేన్షన్ హాల్ లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈజీఎంఎం సహాకారంతో సుమారు 63 ప్రైవేటు కంపెనీలలో 11వేల ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వూలు నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు మండలం, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతో పాటు జిల్లాలోని కోడంగల్, పరిగి, వికారాబాద్ లో పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతి యువకులు పోటెత్తారు. ఆయా కంపెనీలలో ఇంటర్వూలకు హాజరైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామకం చేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరుల చేతుల మీదుగా నియామకపత్రాలను అందుకున్నారు. సంవత్సరానికి రూ. 2లక్షల పైనుంచి ప్యాకేజీతో నిరుద్యోగులు ఉద్యోగాలను పొందారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన జాబ్ మేళాలో వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరయ్యారు.

అధికారులు, నేతల సహాకారం

జాబ్ మేళా విజయవంతం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు, పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, వైద్యం, విశ్రాంత ఉద్యోగులతో పాటు తాండూరుకు చెందిన పలు స్వచ్చంద సంఘాల నాయకులు, ప్రతినిధులు సహాకారం అందజేశారు. జాబ్ మేళాలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థుల కోసం సేవలు అందించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు సేవలు అందించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Latest News