మొబైల్స్ లో గేమ్స్ వద్దు అన్నందుకు విద్యార్థి ఆత్మహత్య..
By Ravi
On
వీడియో గేమ్ ఆడుతూ .టివి చూస్తూ సరిగా చదవడంలేదని కొడుకును తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వినయా నగర్ లోని రాధారెసిడెన్సీలో కంబాలపల్లి సుజాత, వెంకటయ్య కుటుంబం వాచ్ మెన్ గా జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్దకు మారుడు కం బాలపల్లి రిషి(16) ఇటీవల పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. దీంతో మానసిక ఒత్తిడికి గురికావడంతో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పారు. త్వరలో జరగబోయే సప్లిమెం టరీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ట్యూషన్ పెట్టించారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఫోన్లో మొబైల్ గేమ్ ఆడుతుండగా తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రిషి అపార్ట్మెంట్ పైకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags: #saidabadpolice#
Related Posts
Latest News
30 May 2025 17:43:22
విధి నిర్వహణలో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్లను ప్రయాణికులకు అందజేిసి.. మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ నెల...