చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..

By Ravi
On
చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..

చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. జవహర్ నగర్ కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌస్ లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉంటుంది. మమత చిట్టీల వ్యాపారం చేసేది. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మమత ఇల్లు ఖాళీ చేసి వెళ్లింది.  చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి మమత, ఆమె భర్త హేమంత్ వచ్చారు. చిట్టి డబ్బులుIMG-20250519-WA0012 ఇవ్వాలని పట్టుబట్టారు ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. ఊడిన వేలిని పట్టుకుని ఆసుపత్రికి పరుగులు తీయగా, ఆ వేలిని అతికించలేమని వైద్యులు తేల్చిచెప్పారు. సుజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హేమంత్ ను అరెస్ట్ చేశారు.

Tags:

Advertisement

Latest News

రైతుల పంటల సాగుపై అవగాహన రైతుల పంటల సాగుపై అవగాహన
సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని, పాటించాల్సిన విధానాలపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫిసర్ డా.శ్రీదేవి మూడుచింతలపల్లి మండలం లక్ష్మా పూర్...
ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్
మేడ్చల్ లో మరో దారుణ హత్య
కారు బీభత్సం.. బాలుడు మృతి.. బాలికకు గాయాలు
హైదర్ నగర్ లో విరుచుకుపడ్డ హైడ్రా.. షెడ్ల తొలగింపు
చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..