టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ

By Ravi
On
టర్కీతో ఒప్పందం రద్దు చేసుకున్న యూనివర్సిటీ

సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన చేసిన మౌలానా యూనివర్సిటీ

టర్కీతో ఇక సంబంధాలు రద్దు

పాకిస్తాన్ కి మద్దత్తుగా నిలచిన టర్కీతో విద్యాపరమైన ఒప్పందం ఇక ఉండదని చెప్పిన యూనివర్సిటీ

 

హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) సంచలన నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన యూనస్ ఎమ్ర్రే ఇన్‌స్టిట్యూట్‌తో కుదుర్చుకున్న విద్యాపరమైన అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) తక్షణమే రద్దు చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారికంగా ప్రకటించింది. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు టర్కీ మద్దతు ఇస్తోందని, దీనికి నిరసనగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వవిద్యాలయం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 2వ తేదీన మౌలానా ఆజాద్ వర్సిటీ మరియు యూనస్ ఎమ్ర్రే ఇన్‌స్టిట్యూట్ మధ్య ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఈ ఒప్పందం కుదిరింది.
ఈ ఎంఓయూ కింద, మౌలానా ఆజాద్ వర్సిటీలోని స్కూల్ ఆఫ్లాంగ్వేజెస్, లింగ్విస్టిక్స్ & ఇండాలజీ విభాగంలో టర్కిష్ భాషలో డిప్లొమా కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు బోధన నిమిత్తం టర్కీ నుంచి ఒక విజిటింగ్ ప్రొఫెసర్‌ను కూడా నియమించడం జరిగింది. అయితే, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సదరు విజిటింగ్ ప్రొఫెసర్ ఇప్పటికే తన స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారని విశ్వవిద్యాలయ వర్గాలు తెలియజేశాయి. ఈ నిర్ణయంతో టర్కీ సంస్థతో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఉన్న విద్యా సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లయింది.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు