సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్ కార్యక్రమం లక్ష్యంగా మరియు ఆర్థిక భద్రత కల్పించడంలో 20 సంవత్సరాల సేవను పురస్కరించుకుని, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నానక్రంగూడ ట్రాఫిక్ జంక్షన్ వద్ద రోడ్ సేఫ్టీ మరియు ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) మరియు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిన అవసరం, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి, హెల్మెట్ ధరించాలన్న అలవాటు పెంపొందించడంలో వారిని ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ MD & CEO క్యాస్పరస్ J.H. క్రామ్హౌట్, ట్రాఫిక్ ACP మాధాపూర్ డివిజన్ సత్యనారాయణ, SCSC CEO నవేడ్ ఆలం ఖాన్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ CIO అజిత్ బెనర్జీ, స్ట్రాటజిక్ అడ్వైజర్ రవికుమార్, మల్టీ ప్రోడక్ట్స్ హెడ్ సునీత సాంబరాజు, లీడ్ ఇన్సూరర్ ప్రాజెక్ట్ AGM జాన్ కే. మనోజ్, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, మహిళల భద్రత మరియు ట్రాఫిక్ విభాగానికి చెందిన లలిత తిమ్స్ మరియు కేశవ్ భండారి, SCSC ట్రాఫిక్ వాలంటీర్లు పాల్గొన్నారు.