సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక

By Ravi
On
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి  ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు దేపా భాస్కర్ రెడ్డి  సబితా ఇంద్రారెడ్డి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి  నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  సహకారంతో అనేక నిధులను సమకూర్చి అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. దేపా భాస్కర్ రెడ్డి తెలియని విషయాలపై బురద జల్లే ప్రయత్నం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డిని రాజీనామా చేయమని కాదు.. అనేక హామీలు ఇచ్చి పరిపాలనలో ఫెయిల్ అయిన సీఎం రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి మాట్లాడాలని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, భీమిలి జంగారెడ్డి, డిపాల్లాల్ చౌహన్, సాజిత్, రామ్ నరసింహ గౌడ్, సామ సుదర్శన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, బుర్ర మాధవరెడ్డి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు