ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, పౌర సరఫరాల శాఖా ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి కలెక్టర్ గౌతం పాల్గొన్నారు. యాసంగి లోనూ రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. 2023 రబీ సీజన్ లో మే 15 నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ముందెన్నడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల కు 8,348 కొనుగోలు కేంద్రాలు 2021-22 రబీ సీజన్ తో పోలిస్తే ఈ రబీ సీజన్ లో అధికంగా1,739 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలు కేంద్రాల పెంపు చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షించాలని సూచించారు. రానున్న 10,12 రోజులు కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, క్షేత్ర స్థాయిలో లోపాలు గుర్తించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని, నిజానిజాలు ప్రజలకు బహిర్గతం చేసి రైతులకు భరోసా కల్పించడంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ గౌతం, ఇంఛార్జీ అదనపు కలెక్టర్ హరిప్రియ, జిల్లా సివిల్ సప్లై జిఎం సుగుణబాయి, జిల్లా వ్యవసాయాధికారి చంద్రకళ, జిల్లా పౌర సరఫరాల అధికారి తదితరులు పాల్గొన్నారు.