నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
By Ravi
On
నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి చెందాడు. మణికొండ శ్రీరామ్ నగర్ కాలనీ కుతుబ్ ఆర్కేట్ లో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి 4వ అంతస్థులో ఉంటున్నాడు. బెడ్ రూమ్ లో గాఢ నిద్రలో ఉండగా ఏసీలో నుండి మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. దీనితో ఊపిరి ఆడక కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి (38) మరణించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హటాహుటిన అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి కొరియోగ్రాఫర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
08 May 2025 09:14:17
రాజేంద్రనగర్ ఔటర్ రింగ్గురోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ వద్ద బ్రేక్ డౌన్ అయిన కారు టైర్ మారుస్తున్న రికవరీ వ్యాన్ డ్రైవర్ ను...