ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు

By Ravi
On
ఓల్డ్ సిటీ బాబానగర్ లో టెన్షన్... భారీ బందోబస్తు

పాతబస్తీలో ఫుల్ టెన్షన్ నెలకొంది. చాంద్రాయణగుట్టలో తెల్లవారుజామున హైడ్రా రంగంలోకి దిగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాబానగర్ సర్వే నెంబర్ 303, 306 కి చెందిన 2000 గజాల స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రాకి ఫిర్యాదులు అందాయి. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ విచారణ చేపట్టిన అనంతరం కూల్చివేతలు మొదలు పెట్టారు. దీనితో ఆగ్రహించిన ఎంఐఎం నేతలు, బాబానగర్ వాసులు ఆందోళనకు దిగారు. రంగనాథ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కబ్జాకు గురైన 2000 గజాల స్థలంలో నిర్మాణం అయిన భవనాలను నేలమట్టం చేసి స్థలం స్వాదీనం చేసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్ మలక్ పేటలోని మామిడి పండ్ల గోదాములపై దాడి.. ఇద్దరి అరెస్ట్
మలక్ పేటలోని మామిడిపండ్ల గోదాంలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు.  ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్‌ ను వినియోగిస్తూ కృత్రిమ...
మీ వాట్సాప్ లు జర భద్రం
భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో విద్యార్థిని సూసైడ్
హైదరాబాద్ లో బాణసంచా కాల్చడం బ్యాన్
సిసిఐ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో కార్మికుడు మృతి.. ఆందోళన
డ్రగ్స్ కేసులో ప్రముఖ లేడీ డాక్టర్ అరెస్ట్