చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్

By Ravi
On
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్

పాతబస్తీ బీబీక చష్మ ప్రాంతంలో ఈ నెల 2వ తేదీన  జరిగిన మాజిద్ హత్య కేసును ఫలక్ నుమా పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కత్తులు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం  చేసుకున్నారు. మూఢ నమ్మకమే ఈ హత్య కు ప్రధాన కారణం అని ఏసీపీ ఫలక్ నుమా ma జావిద్  వెల్లడించారు. నిందితులు షేక్ ముహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ మరియు షేక్  అక్తర్ అలీ ఈ హత్య కేసులో ఉన్నట్లు ఏసీపీ  తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ మొహమ్మద్ అలీ, షేక్ ఉస్మాన్ అలీ అన్నదమ్ములు, 3వ నిందితుడు షేక్ అక్తర్ అలీ  వీరి తండ్రి. ముగ్గురు నిందితులు మృతుడు మాజీద్ వారి కుటుంబీకులు నిందితులపై చేతబడి చేశారన్న అనుమానంతో  మాజిద్ ను హత్య చేసినట్లు దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2వ తేదీన  ఈ ముగ్గురు నిందితులు, మాజీద్ ఒంటరిగా ఉండటం చూసి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పదునైన కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చారు.
హత్య చేసిన నిందితులను ఈ రోజు ఫలక్ నుమా పోలీసులు అంబర్ పేట ప్రాంతంలో  అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags:

Advertisement

Latest News

కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల...
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..