పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. 

By Ravi
On
పహల్గాం ఉగ్రదాడి.. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌.. 

ఉగ్రవాదంపై పోరాటం భారత్‌ కు రష్యా మరోసారి తన సపోర్ట్ ను తెలిపింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు అని జైస్వాల్‌ పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ప్రకారం శిక్షించాలని అన్నారని, భారతదేశం, రష్యాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు.

ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ విక్టరీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఉగ్రదాడిని పుతిన్‌ ఖండించారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు పహల్గాం నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంతాప సందేశం పంపారు. ఈ దారుణమైన నేరాన్ని సహించేది లేదని.. ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

Advertisement

Latest News

కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు కక్షపూరితంగానే ఎక్సైజ్ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ని ఏసీబీకి పట్టించారు
వికారాబాద్‌ ఈఎస్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీధర్‌ను కక్షపూరితంగా ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  శ్రీనివాస్‌ ఏసీబీకి పట్టించడంపై తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఉద్యోగుల...
నాని దెబ్బ.. చిన్ని అబ్బ..!
సూళ్లూరుపేటలో APTF నిరసన.. తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పణ
విడదల రజనీ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
చేతబడి అనుమానంతో హత్య.. తండ్రీ కొడుకుల అరెస్ట్
తెలంగాణలో డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. 66 కార్పొరేట్ ఫార్మసీలకు షోకాజ్ నోటీసులు
డ్యామ్‌ ల సామర్థ్యం పెంపు.. పాక్ ఖేల్ ఖతం..