రాజేంద్రనగర్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు..!
By Ravi
On
హైదరాబాద్ రాజేంద్రనగర్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పీఎన్టీ కాలనీలో ఇంట్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు.. ఇంట్లో ఉన్న దంపతులను కత్తులతో బెదిరించి 6 తులాల బంగారం, రెండు సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దుండగులు వెళ్లిపోయిన మరుక్షణమే బాధితులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన రాజేంద్రనగర్ పోలీసులు వివరాలు సేకరిస్తుంచారు. నలుగురు దుండగులు స్విఫ్ట్ కార్లో వచ్చినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీతోపాటు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.