వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం..

By Ravi
On
వారికి ఊరట.. గడువు పొడిగించిన కేంద్రం..

పహల్గాం ఉగ్ర దాడితో భారత్‌, పాక్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తానియులు మన దేశం వీడి వెళ్లేందుకు గడువు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వుల్లో తాజాగా సవరించినట్లు తెలుస్తోంది. పాక్‌ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 30న వాఘా, అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును తాజాగా సవరించినట్లు తెలుస్తుంది. తదుపరి ఆదేశాలు వెలువడేవరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్‌ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని నేషనల్ మీడియా నివేదికలు తెలిపాయి. 

పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌ను వీడి వెళ్లాలని పాక్‌ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్థాన్‌ వీసాలున్న భారతీయులున్నారు. గత 6 రోజుల్లో వారంతా అటారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు 1,465 మంది వచ్చారు.

Advertisement

Latest News

స్పెషల్ డ్రైవ్ దాడులతో దడ పుట్టిస్తున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్ స్పెషల్ డ్రైవ్ దాడులతో దడ పుట్టిస్తున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరి అరెస్ట్
స్పెషల్ డ్రైవ్ పేరుతో ఎక్సైజ్ పోలీసులు దాడులతో దడ పుట్టిస్తున్నారు. మలక్‌పేట్‌ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌హెచ్‌ఓ నరేందర్‌ పర్యవేక్షణలో ఓ ఇంటిపై దాడులు...
భద్రాచలంలో భారీగా గంజాయి స్వాధీనం
భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి.. భరోసా ఇస్తున్న సిటీ పోలీసులు
అదిగో యుద్ధం..దోపిడీకి వ్యాపారులు సిద్ధం
ఏఆర్ జవాన్ సందీప్ భౌతికకాయనికి నివాళులర్పించిన సీపీ సుధీర్ బాబు
ఎక్స్ లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న ఓల్డ్ సిటీ స్టూడెంట్.. కేసు నమోదు
కంపెనీలో ఆపరేటర్.. బయట గంజాయి వ్యాపారం