తెలంగాణ డీజీపీ రేసులో 8మంది సీనియర్ ఐపిఎస్ లు
ఐఎఎస్ ల బదిలీ చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక డీజీపీ నియామకంపై దృష్టి సారించింది. ఇందుకు గాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 8 మంది పేర్లను పంపింది. అందులో రవి గుప్తా (1990 బ్యాచ్), సీవీ ఆనంద్ (1991 బ్యాచ్), డా. జితేందర్ (1992 బ్యాచ్), ఆప్టే వినాయక్ ప్రభాకర్ (1994 బ్యాచ్), కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి (1994 బ్యాచ్), బి. శివధర్ రెడ్డి (1994 బ్యాచ్), డా. సౌమ్య మిశ్రా (1994 బ్యాచ్), శిఖా గోయల్ (1994 బ్యాచ్) పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ పంపడం జరిగింది. అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును సూచిస్తూ తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్సీ పంపగా అందులో ఒకరిని డిజీపీ నియమిస్తారు. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న డా.జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేస్తారు. కాగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ చేయనున్నారు. అలాగే
సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి. శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్ 2029 మార్చి వరకు సర్వీస్ ఉంది. ఇందుకు గాను లాంగ్ టర్మ్ సర్వీస్ ఉన్న వారిపైనే ప్రభుత్వం సుముఖత చూపుతున్నట్లు సమాచారం.