మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..!
By Ravi
On
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ఆదివాసీ యువజన సంఘం పేరుతో ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో అతికించిన ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఆదివాసీలను అడవుల్లోకి వెళ్లకుండా బాంబులు పెట్టి అడ్డుకుంటున్నారని.. ఆదివాసీల మీద మావోల అప్రకటిత యుద్ధం ఏంటని ప్రశ్నించారు. కర్రీ గుట్టపైకి ఆదివాసీలు రావద్దు.. వస్తే బాంబులు పేల్చి చంపేస్తామని మావోలు హెచ్చరిస్తున్నారని.. ఆదివాసీలను చంపటం మీ సిద్ధంతమా..? ఇందుకోసమేనా మీ పోరాటం..? కర్రీ గుట్టపై మందుపాత్రలు పాతిన మావోయిస్టులారా తీరవా మీ రక్త దాహాలు..? అంటూ వాల్ పోస్టర్స్లో పేర్కొన్నారు.
Related Posts
Latest News
16 Apr 2025 10:38:54
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నరేందర్ సురాన, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లల్లో, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్తోపాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు...