హైదరాబాద్‌లో గంజాయి పట్టివేత: 15,087 కేజీల గంజాయి స్వాధీనం

By Ravi
On
హైదరాబాద్‌లో గంజాయి పట్టివేత: 15,087 కేజీల గంజాయి స్వాధీనం

WhatsApp Image 2025-03-29 at 4.09.20 PMహైదరాబాద్:

తెలంగాణలోని ఎస్‌టిఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు సంయుక్తంగా గంజాయి వ్యాపారంపై పెద్ద దాడులు నిర్వహించారు. నాలుగు వేర్వేరు కేసుల్లో 15,087 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పలువురిని అరెస్టు చేశారు.

శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్‌టిఎఫ్ మరియు ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి 2.8 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో మహ్మద్ చాంద్ మరియు మహ్మద్ రియాజ్‌లను అరెస్టు చేసి శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

షేర్ లింగం పల్లి చందనగర్ ప్రాంతంలో ఎస్‌టిఎఫ్ బీ.టీమ్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజులతో కలిసి 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దుర్గా ప్రసాద్, ఆయూబ్, మాదావన్, సిద్దిక్, ఇష్రాన్, నవీన్ కుమారులను అరెస్టు చేశారు.

రంగారెడ్డి డివిజన్‌లో, సరూర్‌నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 1.080 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు డివిజనల్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ తెలిపారు.

సికింద్రాబాద్‌లోని లోకమాన్య తిలక్ టర్మినల్ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే జీఆర్‌పీ పోలీసులతో కలిసి నిర్వహించిన తనిఖీలలో 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

పోలీసుల చర్యలతో గంజాయి వ్యాపారం పై గట్టి పట్టు పడుతోంది. ఎస్‌టిఎఫ్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు తెలంగాణలో మాదకద్రవ్యాల వ్యాపారాన్ని ఆపడానికి తమ ప్రయత్నాలు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Tags:

Advertisement

Latest News