పార్థసారధి వివరణ – ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎంపానల్మెంట్ హాస్పటల్స్ పై ఆరోపణలు

By Ravi
On
పార్థసారధి వివరణ – ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎంపానల్మెంట్ హాస్పటల్స్ పై ఆరోపణలు

 

విజయవాడ, 28 మార్చి 2025:

ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడి, ఎన్టీఆర్ వైద్య సేవలు మరియు ఎంపానల్మెంట్ హాస్పటల్స్ పై వివిధ ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం చేసిన పాలన వల్ల 3,000 కోట్ల రూపాయల బకాయిలు మిగిలిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి కొంత నిధులు విడుదల చేయడమేనని చెప్పారు.

పార్థసారధి ఆరోపిస్తూ, “ఎంపానల్మెంట్ హాస్పటల్స్ ప్రజలకు వైద్యం అందించే విషయంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కొన్ని హాస్పటల్స్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రామ్‌ను అంగీకరించకపోవడం, ఎమర్జెన్సీ కేసులలో ప్రజలకు ఆర్థిక భారాన్ని పెంచడం వంటి సమస్యలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

“ఈ హాస్పటల్స్ టెస్ట్‌లు, స్కానింగ్‌లు పేరుతో పేద ప్రజలను పీడిస్తున్నాయి. ప్రభుత్వం పేదల హక్కుల కోసం పనిచేస్తుంటే, ఈ హాస్పటల్స్ మాత్రం వారి పై బురద జల్లుతున్నాయి,” అని ఆయన అన్నారు.

ఆరోగ్య మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ మరియు కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళిక తీసుకున్నారని, ఎన్టీఆర్ వైద్య సేవలు ద్వారా 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

ఎన్టీఆర్ వైద్య సేవలు ద్వారా, ఎంపానల్మెంట్ హాస్పటల్స్ లో పేద ప్రజలకు వైద్యం తీసుకోవడం అవసరం,” అని ఆయన తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క 104 కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రజలకు సూచించారు. “ఎవరైతే ఉచిత వైద్యం అందించకపోతే, వారు తగిన చర్యలు ఎదుర్కొంటారు,” అని పార్థసారధి హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు మరియు వై. సత్యకుమార్ యాదవ్ నాయకత్వంలో, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడినట్లు ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచే అవసరమని పార్థసారధి అన్నారు.

Tags:

Advertisement