తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

By Ravi
On
తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

 

రంగారెడ్డి జిల్లా:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం ఎన్డీ తండాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సక్కుబాయి (35) మరియు ఆమె భర్త పాండు వీరిరకంగా ప్రమాదంలో బలయ్యారు.

సక్కుబాయి, హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పాండు తో కలిసి కొందుర్గులోని తమ భూమిలో తోట పనులను పరిశీలించేందుకు వెళ్లారు. సాయంత్రం స్కూటీపై తిరుగు ప్రయాణం చేసే సమయంలో తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఒకే వరసలో స్కూటీ, ట్రాక్టర్, లారీ వెళ్ళేవారు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టి, వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో సక్కుబాయి అక్కడికక్కడే మరణించారు. ఆమె శరీరం రెండు ముక్కలైంది. భర్త పాండు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు తీవ్ర గాయాలతో 108 అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు.

ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..