మిస్‌ ఫైర్‌.. ఇజ్రాయిల్ ప్రజలపై బాంబు?

By Ravi
On
మిస్‌ ఫైర్‌.. ఇజ్రాయిల్ ప్రజలపై బాంబు?

హమాస్‌ ను మట్టికరిపించే లక్ష్యంతో సంవత్సరం పైగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో తాజాగా ఊహించని ఘటన ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్‌ జారవిడిచిన బాంబు సొంత ప్రజలు నివసిస్తోన్న ప్రాంతంలో పడింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్‌ ప్రజలు నివసించే నిర్‌ యిట్జాక్‌ ప్రాంతంలో ఐడీఎఫ్ యుద్ధ విమానం బాంబు జారవిడించింది. 

గాజా మిషన్ నిమిత్తం వెళ్తోన్న విమానం నుంచి బాంబు జారిపడిపోయింది. టెక్నాలజీ మిస్టేక్ కారణంగా అలా జరిగింది అని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో ఒప్పుకుంది. ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. యిట్జాక్ ప్రాంతంలో 550 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే వీరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. గాజాలో నెతన్యాహు పర్యటించిన తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా.. ఆ పర్యటన వేళ నెతన్యాహు తన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. హమాస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. బందీలను అందరినీ విడుదల చేయాలని మేం ఒత్తిడి చేస్తున్నామని అన్నారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!