తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

By Ravi
On
తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

 

రంగారెడ్డి జిల్లా:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మహేశ్వరం మండలం ఎన్డీ తండాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సక్కుబాయి (35) మరియు ఆమె భర్త పాండు వీరిరకంగా ప్రమాదంలో బలయ్యారు.

సక్కుబాయి, హైదరాబాద్ లోని అంబర్ పేట్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పాండు తో కలిసి కొందుర్గులోని తమ భూమిలో తోట పనులను పరిశీలించేందుకు వెళ్లారు. సాయంత్రం స్కూటీపై తిరుగు ప్రయాణం చేసే సమయంలో తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఒకే వరసలో స్కూటీ, ట్రాక్టర్, లారీ వెళ్ళేవారు. ఈ క్రమంలో లారీ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొట్టి, వాహనంపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో సక్కుబాయి అక్కడికక్కడే మరణించారు. ఆమె శరీరం రెండు ముక్కలైంది. భర్త పాండు మరియు ట్రాక్టర్ డ్రైవర్ రాజు తీవ్ర గాయాలతో 108 అంబులెన్స్ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు.

ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!