పేట్ బషీరాబాద్: ఫాక్స్ సాగర్ చెరువులో రెండు మృతదేహాలు లభ్యం
By Ravi
On
హైదరాబాద్, 24 మార్చి 2025: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాక్స్ సాగర్ చెరువులో రెండు మగ మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువు కట్టపై పాదచారులు 100 డయల్ కు సమాచారం ఇచ్చిన అనంతరం, పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు.
ప్రాధమిక దర్యాప్తులో మృతుల identities గా ఉమామహేశ్వర్ కాలనీ నివాసితులు నామ్ దేవ్ (45)గా, మరొక మృత దేహం నామ్ దేవ్ మేనల్లుడు బాలాజీగా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, మృతులు అర్ధరాత్రి సమీపంలోని బార్ లో మద్యం సేవించి, ద్విచక్ర వాహనంపై వెళ్ళిపోతుండగా, చీకట్లో దారి తప్పి, బైక్ అదుపు తప్పి చెరువులో పడి మృతి చెందారని తెలిపారు.
ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags:
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...