పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి.
By Ravi
On
పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి... పార్వతీపురం పట్టణం లోని వివేక్ ట్యూషన్ సెంటర్ లోని 35 మంది పదవ తరగతి పేద విద్యార్థులకు అట్టలు, పెన్నలు, పెన్సిల్స్, స్కేల్స్ తదితర పరీక్ష సామగ్రి అందజేశారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ కొమిరి. కృష్ణమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాతూ..ప్రతి ఒక్క విద్యార్థి ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని కోరారు. స్వామి వివేకానంద ,డా.ఏపీజే అబ్దుల్ కలాం, డా. బి.ఆర్ అంబేద్కర్ వంటి మహానుభావుల అడుగుజాడల్లో నడిచి దేశానికి మంచి పేరు తీసుకురావలని కోరారు. అనంతరం కృష్ణమూర్తి ని ఉపాధ్యాయులు మహంతి శ్రీనివాసరావు, నర్సింహ దేవ్, విద్యార్థులు దుశ్శాలువ కప్పి సన్మానించారు.
Tags:
Latest News
07 Apr 2025 12:40:39
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై...