శిండేపై కామెంట్స్.. బాంబే హైకోర్ట్ లో కునాల్ కమ్రా!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై ఫైల్ చేసిన కేసులను కొట్టివేయాలని కునాల్ బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించారు. తాను రాజ్యాంగం ప్రకారమే నియమ నిబంధనలతో తన షోను నిర్వహిస్తున్నానని అన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కును ఉల్లంఘించేలా తనపై కేసులు ఫైల్ చేశారని తన పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ కేసు విచారణ ఏప్రిల్ 21 న జరగనుంది. ఇక రీసెంట్ టైమ్స్ లోనే ముంబాయిలోని ఓ హోటల్ లో కునాల్ స్టాండప్ కామెడీ షో చేశారు.
ఈ ప్రోగ్రామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేను దేశ ద్రోహిగా కామెంట్ చేస్తూ.. దిల్ తో పాగల్ హై అనే మూవీలోని సాంగ్ కి పేరడీలా కునాల్ సాంగ్ పాడటంతో ఈ వివాదం చెలరేగింది. రాష్ట్ర డిప్యూటీ సీఎంపై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ కునాల్ కమ్రాపై పలు కేసుల్ని నమోదు చేశారు. కాగా ఈ కామెంట్స్ ని నిరసనగా ఆ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడికి సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి.. కునాల్ కు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కునాల్ ఈ సమన్లకు రెస్పాన్డ్ అవ్వలేదు. తాజగా ఆయన బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే కునాల్ ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. ఏప్రిల్ 7 వరకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కునాల్ కమ్రా చేసిన కామెంట్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
Latest News
