గంజాయి మత్తులో దాడులు చేసుకున్న యువకులు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా :దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ 22బ్లాక్ వద్ద గంజాయి మత్తులో కొందరు హల్చల్ చేశారు. మత్తులో మహిళలు అని చూడకుండా వారిపై చేయి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకుంటూ దాడులకు తెగపడ్డారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రక్తం వచ్చేలా నిత్యం దాడులు చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారని డబల్ బెడ్ రూమ్ నివాసితుల ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
Related Posts
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...