గంజాయి మత్తులో దాడులు చేసుకున్న యువకులు..

By Ravi
On
గంజాయి మత్తులో దాడులు చేసుకున్న యువకులు..

మేడ్చల్ జిల్లా :దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్  22బ్లాక్ వద్ద గంజాయి మత్తులో కొందరు హల్చల్ చేశారు. మత్తులో మహిళలు అని చూడకుండా వారిపై చేయి చేసుకున్నారు. ఒకరిపై మరొకరు కర్రలతో దాడి చేసుకుంటూ దాడులకు తెగపడ్డారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రక్తం వచ్చేలా నిత్యం దాడులు చేసుకుంటూ బెంబేలెత్తిస్తున్నారని డబల్ బెడ్ రూమ్ నివాసితుల ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.

Advertisement

Latest News