రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు..

By Ravi
On
రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు..

ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్     27 కేసుల్లో పట్టుబడిన రూ. 10.11కోట్ల గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్‌ స్టేషన్లలో 27 కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఆల్పోజోలం, డైజో ఫామ్ లాంటి మత్తు పదార్థాలను మంగళవారం దహనం చేశారు. మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ జె. హరి కిషన్‌ డిస్పోజల్‌ అధికారిగా ఇచ్చిన  అదేశాల మేరకు సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్‌ స్టేషన్లలో పట్టుబడిన  మత్తు పదార్థాలను మెడికేర్‌ వెస్టేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఇస్నాపూర్‌ ప్రాంతంలో కాల్చి వేశారు. పటాన్‌ చెరువు స్టేషన్‌లో 10 కేసులు, సంగారెడ్డి స్టేషన్‌లో 7 కేసులు, నాయయణ ఖేడ్‌ లో 3, ఆదోల్‌లో నాలుగు కేసుల్లో పట్టుబ డిన డ్రగ్స్‌,  గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నవీన్‌ చందర్‌ అధ్వర్యంలో  దాహనం చేశారు. దహనం చేసిన డ్రగ్స్‌ విలువ రూ. 10.11 కోట్లుగా  ఉంటుందని ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నవీన్‌ చందార్‌ తెలిపారు.

Advertisement

Latest News