సిటీలో డ్రగ్స్ దందా. కింగ్ పిన్ తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్..
By Ravi
On
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేకెత్తించిన డ్రగ్స్ కేసును ఎస్ఓటి, కూకట్ పల్లి పోలీసులు చేదించారు. నిందితుల్లో తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారానే నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు ఇంచార్జ్ మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి వెల్లడించారు. A2గా ఉన్న సురేంద్ర, A3 హరిబాబు రెడ్డి, A4 మెర్కీ మార్గరేత్, A5 షేక్ మాస్తన్ వాలీ,A6)దేవరాజు యేసుబాబు ల అరెస్ట్ చేశారు. తిరుపతి ఏఐర్ కానిస్టేబుల్ గుణశేఖర్ తో పాటు A7 అప్పన్న లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుండి 820గ్రాముల ఎఫిడ్రిన్ కొకైన్ తో పాటు ఒక వెయింగ్ మిషన్, 4మొబైల్స్ సీజ్ చేశారు. ఈ డ్రగ్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని వివరించారు. నిందితులను రిమాండ్ కి తరలించారు.
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...