షాద్ నగర్ లో ఎస్ఓటి దాడి.. భారీగా డ్రగ్స్ స్వాధీనం..
హైదరాబాద్ శివారు షాద్ నగర్ లో పోలీసులు, SOT శంషాబాద్ కలిసి రాయకల్ టోల్ ప్లాజా దాబా వద్ద దాడి చేసి భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. పట్టుబడిన నిందితుల నుండి 632ఓపిఎం, 1కేజీ గాంజా, 1.5కేజీ హేరైన్, 2.8కేజీ పప్పి స్ట్రా, స్వాధీనం చేసుకున్నారు.
కుక్ గా పని చేసే వ్యక్తి వికాస్ సోహు రాజేస్తాన్ నుండి తీసుకొచ్చి తెలిసిన కస్టమర్స్ కి అమ్ముతున్నాడని
పట్టుబడ్డ డ్రగ్స్ 3.5కోట్లు విలువ ఉంటుందని కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సోహు,సోదరుడు ఇద్దరు కలిసి ఇది చేస్తున్నారని హెరైన్ ని పప్పీ లో కలిపి కేజీ హెరైన్ రూ.2కోట్లకు పైగానే విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. దాబా కు వచ్చే కష్టమర్స్ కి మాత్రమే అమ్ముతున్నారని పట్టుబడిన నిందితుడు ఫోన్స్ తీసుకున్నాం.. అతని కాంటాక్ట్ ఆధారంగా కస్టమర్స్ పై దృష్టి పెట్టామని సీపీ చెప్పారు. మధ్యప్రదేశ్, హైదరాబాద్ కు చెందిన వ్యక్తులతో లింక్స్ ఉన్నాయని,
ఈ కేసులో 89,700నగదు, 30వేల విలువైన 3మొబైల్ ఫోన్స్, వేయింగ్ మెషీన్, ప్యాకింగ్ కవర్ ప్యాకెట్ సీజ్ చేశరన్నారు. పరారీలో ధూల్పెట్ కి చెందిన సలీమ్ , మహేశ్వరంకు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన గన్పథ్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు.