వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..
By Ravi
On
రామాంతపూర్ మాధురి రెస్టారెంట్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఏ టీం సిబ్బంది దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 10 ఎల్ఎస్డి బ్లాస్ట్ ను పట్టుకున్నారు.
డ్రగ్స్ తో పాటు ఒక మొబైల్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎం. దీపక్, కెవిన్, మహమ్మద్ సాజిద్ లను అరెస్ట్ చేసి ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఏ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
1.1 కేజీల గంజాయి పట్టివేత..
సరూర్నగర్ లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సి టీం సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రజ్వల్ సి. పవన్ ప్రసన్నకుమార్ ఎం. శ్రీకర్లను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో డి స్వప్నిక్ పరార్ లో ఉన్నట్లు ఎస్టిఎఫ్ సిటీ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Latest News
31 May 2025 20:19:08
హైదరాబాద్: మూడు దశాబ్దాలు పోలీస్ శాఖలో సేవలు, మూడేళ్లు ఎక్సైజ్ శాఖలో సేవలు అందించడం చాల అరుదైన విషయమని, మీ సూచనలు, సలహాలు ఎస్ టి ఎఫ్...