వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..

By Ravi
On
వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కండ‌క్ట‌ర్ కుమారుడి స‌త్తా..

మొరాకోలో ఇటీవ‌ల జ‌రిగిన వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో కూక‌ట్‌ప‌ల్లి డిపోన‌కు చెందిన కండ‌క్ట‌ర్ బానోత్ మోహ‌న్ కుమారుడు అకీరా నంద‌న్ స‌త్తా చాటాడు. 400 మీట‌ర్ల ప‌రుగు పందెంను 53.07 సెక‌న్ల‌లో పూర్తి చేసి అగ్ర‌స్థానంలో నిలిచి స్వ‌ర్ణ ప‌త‌కం సాధించాడు. 200 మీట‌ర్ల ప‌రుగులోనూ కాంస్య ప‌త‌కాన్ని సొంతం చేసుకున్నాడు. వ‌ర‌ల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో మెరిసిన కండ‌క్ట‌ర్ కుమారుడు అకీరా నంద‌న్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ అభినందించారు. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లోని త‌న చాంబ‌ర్‌లో గురువారం అకీరా నంద‌న్‌ను ఆయ‌న స‌న్మానించారు. త‌న కుమారుడిని క్రీడ‌ల్లో రాణించేలా ప్రోత్స‌హిస్తోన్న కండ‌క్ట‌ర్ మోహ‌న్ దంప‌తుల‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. భ‌విష్య‌త్‌లో మంచిగా ప్రాక్టిస్ చేసి మ‌రిన్ని అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై అత్యుత్త‌మంగా రానించాలని అకీరా నంద‌న్‌కు సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌లు ముని శేఖ‌ర్, వెంక‌న్న, సీటీఎం (క‌మ‌ర్సియ‌ల్) శ్రీధ‌ర్, సీపీఎం ఉషాదేవి,  కూక‌ట్ ప‌ల్లి డీఎం హ‌రి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Advertisement

Latest News