సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ
By Ravi
On
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జనవరిలో పోలీసులను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, లాఠీ ఛార్జ్ చేయలేదని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్ కి ఎలా వస్తారంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:
Latest News
24 May 2025 13:41:30
కొండాపూర్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో ప్లాట్ నెంబర్ 147లో 300గజాల ప్లాట్ కు సంబందించి నకిలీ పత్రాలు సృష్టించి బిల్డర్ నిర్మాణాలు చేపట్టాడు. ఒరిజినల్ ఓనర్...