కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

By Ravi
On
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఔదార్యాన్ని  మరోసారి చాటుకున్నారు. రుద్రారం గ్రామంలో CSR నిధులతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి, అసైన్‌మెంట్ భూమి లబ్ధిదారులైన జొన్నాడ మహేష్, జహంగీర్ లకు తన సొంత నిధుల నుంచి చెరో ₹5 లక్షల చొప్పున మొత్తం ₹10 లక్షలు అందజేశారు. పాఠశాల నిర్మాణం పూర్తయితే నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని ఆయన ఆకాంక్షించారు.అంతేకాకుండా, ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త కురుమ నరసింహులు కుటుంబానికి ₹1 లక్ష ఆర్థిక సహాయం అందించి, భవిష్యత్తులో వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దాతృత్వం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎం.పి.పి. శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, పి.ఎ.సి.ఎస్. చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ...
కవిత లేఖ.. బిఆర్ఎస్ లో లుకలుక
ఇటుకబట్టీల్లో చైల్డ్ లేబర్.. అధికారుల సీరియస్
సీఎం ఓఎస్డి అంటూ మాజీ క్రికెటర్ బెదిరింపులు.. అరెస్ట్
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎక్స్ లోకి అడుగుపెట్టిన డిసిఏ..