బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం
బక్రీద్ పండుగ సందర్భంగా పోలీసుల సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని, హైదరాబాద్ నగరంలో శాంతియుత వాతావరణంలో, నగరాన్ని పరిశుభ్రంగా పెడుతూ పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ అధ్యక్షతన బషీర్ బాగ్ పాత పోలీసు కమిషనర్ ఆఫీసు, 5వ అంతస్తు కాన్ఫరెన్స్ హాల్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు సి.పి. లా అండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్ ఆర్.వి. కర్ణన్ ఐఏఎస్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ క మిషనర్ సి రమేష్ పంకజ్ అడిషనల్ కమిషనర్ హెల్త్ రఘు ప్రసాద్ అడిషనల్ కమిషనర్ సానిటేషన్ డాక్టర్ సిహెచ్ మల్లేశ్వరి అడిషనల్ డైరెక్టర్ వి అండ్ ఏ హెచ్ డిసిపి స్పెషల్ బ్రాంచ్ సైబరాబాద్ డిసిపి రాజేంద్రనగర్ డిసిపి బాలనగర్ డిసిపి ఎల్బీనగర్ మరియు హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ కు సంబంధించిన డిసిపిలు, అడిషినల్ డిసిపి,డివిజన్ ఎసిపిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి.వి. ఆనంద్ మాట్లాడుతూ సరైన వెటర్నరీ సర్టిఫికెట్లు లేని మరియు వధకు సిద్ధంగా లేని పశువులను అక్రమంగా తరలించడాన్ని నిరోధించడానికి హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకుని, జీహెచ్ఎంసీ నిర్దేశించిన పశువుల హోల్డింగ్ పాయింట్లు లేదా గోశాలలకు తక్షణమే పంపించాలని ఆదేశించారు. పశువులను తీసుకెళ్లే వాహనాలను ఆపడం లేదా తనిఖీ చేయడం ప్రభుత్వ అధికారులు మరియు చట్టం అమలు చేసే సంస్థలు మాత్రమే చేయాలని, ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. పశుసంవర్ధక శాఖ మరియు జీహెచ్ఎంసీ అన్ని చెక్పోస్టుల వద్ద 24/7 వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరడం జరిగింది. జీహెచ్ఎంసీ అధికారులకు బక్రీద్కు ముందు వీధి కుక్కలను పట్టుకోవడానికి అన్ని ప్రాంతాల్లో డాగ్ క్యాచింగ్ స్క్వాడ్లను మోహరించాలని, పశువుల కళేబరాల పారవేయడం కోసం ప్రతి ఇంటికి డిస్పోజల్ కవర్లను సరఫరా చేయాలని, పండుగ రోజున చెత్త, కళేబరాల సేకరణ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. పశువుల వ్యర్థాలను సమర్థవంతంగా సేకరించడం మరియు పారవేయడం కోసం తగినన్ని వాహనాలు, టిప్పర్లు మరియు జేసీబీలను సమకూర్చాలని, బక్రీద్ సందర్భంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తొలగించడానికి సరిపడే సిబ్బందిని నియమించాలని కోరారు. విద్యుత్ మరియు ఇంజినీరింగ్ శాఖ పండుగ సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి మరియు ఇంజినీరింగ్ అధికారులు మురుగు నీటి వ్యవస్థలను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, పండుగ సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని తెలిపారు.
ఆర్టీఏ అధికారులు డ్రైవర్లు, మెకానిక్లు మరియు క్రేన్లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ మాట్లాడుతూ, వార్డులు మరియు మసీదుల సమీపంలో అదనపు పారిశుధ్య బృందాలు మరియు చెత్త సేకరణ వాహనాలను మోహరించడంతో సహా అమలు చేస్తున్న విస్తృతమైన పారిశుధ్య చర్యలను వివరించారు. చెత్త సంచులు సిద్ధంగా ఉంటాయని, జీహెచ్ఎంసీ అధికారులు చురుకుగా విధులు నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు.
సి.వి. ఆనంద్ ఐపీఎస్, చెక్పోస్టులలో కేటాయించిన పోలీస్ సిబ్బంది, జీహెచ్ఎంసీ మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది మాత్రమే ఉంటారని తెలిపారు. మెరుగైన సమన్వయం మరియు ప్రతిస్పందన కోసం అన్ని విభాగాల అధికారులతో కూడిన స్థానిక, జోనల్ మరియు కమిషనరేట్ స్థాయి సమన్వయ బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిరంతర సమన్వయం, అధికారుల చురుకైన చర్యల వలన ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఈ సమన్వయంతో కూడిన యంత్రాంగం ఎంతగానో దోహదపడుతుందని, తద్వారా నగర వాసులు అందరు బక్రీద్ను సాఫీగా, సురక్షితంగా మరియు ఆనంద దాయకంగా జరుపుకోవడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.