చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు

By Ravi
On
చిన్నారికి కేక్ ఇచ్చి.. ఫోన్ తో ఉడాయించిన దుండగులు

నగర శివారులో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆడుకుంటున్న మూడేళ్ల పాపకు కేకు ఇచ్చి, అనంతరం చిన్నారి చేతిలోని ఫోన్‌ను లాక్కెళ్లారు. ఈ సంఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పటాన్ చెరువు రుద్రారం ముంబై జాతీయ రహదారిపై శ్రీకాంత్ అనే వ్యక్తి తాటి ముంజలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కారులో వచ్చిన వ్యక్తులు శ్రీకాంత్ కూతురి వద్ద ఆగారు. వారిలో ఒకరు పాపకు కేకు ఇచ్చి, ఫోన్ తో   ఆడుకుంటున్న సమయంలో ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని కారులో వేగంగా వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిసి ఫుటేజ్ సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి రోడ్డుప్రమాదంలో హార్డ్ వేర్ పార్క్ ఉద్యోగి మృతి
రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ బాలాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలో RCI రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న గ్రానైట్ ట్రాక్టర్ ని బైక్...
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్
ఎదులబాద్ గ్రామపంచాయతీ అవకతవకల్లో బిల్ కలెక్టర్ అరెస్ట్
కమిషనర్ ఆనంద్ ను అభినందించిన డీజీపీ జితేందర్
పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలి. డీజీపీ జితేందర్
డెలివరీ బాయ్ పై బ్లేడ్లతో దాడి చేసి దోపిడీ
సీఎం రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది