గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు

By Ravi
On
గుట్టలు గుట్టలుగా మందులు.. సీజ్ చేసిన డిసిఏ అధికారులు

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలంలోని ఐడీఏ నాచారంలో ఓ గోదాంపై దాడి చేశారు. ఈ గోదాంలో బల్క్ గా విక్రయించేందుకు నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ గోదాం ఇండియన్ డ్రగ్స్ అండ్ కెమికల్ కి చెందినదిగా గుర్తించారు.శామీర్పేటకు చెందిన డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఈ దాడి చేసి అక్రమ గోదాంను సీజ్ చేశారు. గోదాంలో నిల్వ చేసిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మందులన్నీ అనధికారికంగా తయారు చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అనుమతి లేకుండా తయారు చేసిన నిందితులకు ఐదు సంవత్సరాల జైల్ శిక్ష పడుతుందని డ్రగ్స్  కంట్రోల్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం హెచ్చరించారు. ఎవరికైనా ఇలాంటి గోదాంలు ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. ఈ దాడిని శామీర్‌పేట్ అసిస్టెంట్ డైరెక్టర్ అంజుం ఆబిదా, హబ్సిగూడా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్  జి. ఇంద్ర ప్రియదర్శిని, ఉప్పల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ బి. లక్ష్మి నారాయణ, శామీర్‌పేట్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ బి. ప్రవీణ్, మెడిపల్లీ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్  పి. అంబేద్కర్ లు నిర్వహించారు.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు