ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు

By Ravi
On
ట్రాఫిక్ జామ్ లో ఆగిన అంబులెన్స్ లు .. జాతీయ రహదారిపై హల్చల్ చేసిన వ్యక్తులు

IMG-20250516-WA0059పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధి రుద్రారం గ్రామ శివారులోని జాతీయ రహదారిపై నలుగురు యువకులు బీభత్సం సృష్టించారు. రోడ్డుపై ఆగి ఉన్న కారును వెనుక నుండి ఢీకొట్టిన అనంతరం, కారులో ఉన్న వారిపై దాడి చేసి గంట పాటు హల్చల్ చేశారు.
నగర శివారులోని ప్యాలస్ హోటల్ ముందు ముంబాయి జాతీయ రహదారిపై ఓ కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చినా బైక్ కారును ఢీకొట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన అదే బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కారులో ఉన్న వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. ఈ దాడి కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అంబులెన్సులు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో రోగులకు సకాలంలో వైద్య సహాయం అందక ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొడవ పడుతున్న ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై గంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేశారు.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు