కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్

By Ravi
On
కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్

 హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి బెల్లంఆలం కారులో తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఎస్సై బాలరాజు టీం కలిసి హైదరాబాద్ శివారు బిఎన్ రెడ్డి కాలనీ సమీపంలో దాడి చేశారు.  కారులో తరలిస్తున్న 570 కేజీల బెల్లం,50  కేజీల ఆలం విలువ రూ. 62 వేలుగా ఉంటుందని గుర్తించారు. బెల్లాన్ని తరలిస్తున్నటువంటి కారుని సీజ్ చేశారు. ఈ బెల్లాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంబోతు తండాకు తరలిస్తున్నట్లు కారు డ్రైవర్ రాజు విచారణలో వెల్లడించాడు. ఈ కేసులో కారు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. బెల్లాన్ని పట్టుకున్నటువంటి టీమును ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం , టీం లీడర్ ప్రదీప్ రావు అభినందించారు.

Tags:

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్