ఆడపిల్ల పుట్టిందని కత్తితో పసికందును గొంతుకోసిన తండ్రి

By Ravi
On
ఆడపిల్ల పుట్టిందని కత్తితో పసికందును గొంతుకోసిన తండ్రి

ఆడపిల్ల పుట్టిందని కసాయిగా మరీనా ఓ తండ్రి చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  నేపాల్‌ నుండి వచ్చి ఒక అపార్టుమెంటులో వాచ్ మెన్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్న జగత్ విశ్వకర్మ, గౌరీ  దంపతులు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉండగా, అనారోగ్యంతో కొడుకు మృతి చెందాడు. 14 రోజుల క్రితం గౌరీకి ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లి పొత్తిళ్ళలో నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకువెళ్లి కత్తితో గొంతుకోసి మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టి చెత్తకుప్పలో పడేశాడు. ఒక గంట తరువాత నిద్ర లేచిన గౌరి పాప ఎక్కడని నిలదీయగా, చంపేసి గోనె సంచిలో పెట్టానని జగత్ చెప్పడంతో గౌరీ సమీపంలో ఉన్న పరిచయస్తుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags:

Advertisement

Latest News

ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు ఏఐజి రోగులను పరామర్శించిన అందాల భామలు
మిస్ వరల్డ్  పోటీ పడుతున్న పలువురు సుందరీమణులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమ పర్యటనలో భాగంగా,...
నాంపల్లి నుంచి అన్ రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు.. వాటి వివరాలు ఇవే
ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. ధనుంజయరెడ్డి..కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
సైబరాబాద్ లో రోడ్ సేఫ్టీ.. ఆర్ధిక భద్రతపై అవగాహన ర్యాలీ
సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తే తరిమికొడతాం.. బిఆర్ఎస్ నేతల హెచ్చరిక
మూడు కేసుల్లో 3.455 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
ఘనంగా చేవెళ్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు