సరస్వతి పుష్కరాలకు మేడ్చల్ నుండి ప్రత్యేక బస్సులు
By Ravi
On
మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఈనెల 15 నుండి 26 వరకు మేడ్చల్ ఆర్టీసీ డిపో నుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు ప్రతి రోజు రాత్రి 8 గంటల నుండి ప్రత్యేకంగా మెట్రో డీలక్స్ బస్సు నడపడం జరుగుతుందని డిపో మేనేజర్ సుధాకర్ తెలిపారు. ఈ బస్సు మరుసటి రోజు ఉదయం 3 గంటలకు చేరి తిరిగి ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. టిక్కెట్లు కావాల్సిన వారు బస్సు లో లేదా ఆన్ లైన్ www.tgsrtc.in వెబ్ సైట్ లో పొందవచ్చన్నారు. ప్రయాణికులు 78884 మరియు తిరుగు ప్రయాణం కు 78885 సర్వీసు నంబర్లపై రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు.ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Tags:
Latest News
15 May 2025 22:00:00
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శెట్టికుంటలో గురువారం మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. శెట్టికుంటలో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఉన్న కేవలం సామాన్యులపై...