బీబీనగర్ లో ప్యాసింజర్ రైల్ కి తప్పిన ముప్పు
By Ravi
On
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పింది. మిర్యాలగూడ - కాచిగూడ కు వెళ్లే డెమో ట్రైన్ ప్యాసింజర్ రైలు... మిర్యాలగూడ నుండి కాచిగూడ కు వెళ్తుండగా బీబీనగర్ వద్ద ఆగింది. పైలెట్ భోగి వెనుక భాగంలో బోగి క్రింది భాగంలో మంటలు ఏర్పడ్డాయి. గమనించిన ప్రయాణికులు పైలెట్, రైల్వే సిబ్బంది కి సమాచారం అందించడంతో అప్రమత్తమై మంటలు ఆర్పివేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రైలు ను బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ప్రయాణికులు వేరు వేరు మార్గాల్లో హైదరాబాద్ కు బయలుదేరారు.
Tags:
Latest News
15 May 2025 17:45:20
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్, ఎన్ఫోర్స్మెంట్ కొత్త డైరెక్టర్ షానవాజ్ ఖాసిం చేపట్టిన ఎన్పీడీఎస్ స్పెషల్ డ్రైవ్ మంచి ఫలితాలను ఇచ్చాయి. వారం...