సరస్వతినది పుష్కరాల పోస్టర్ విడుదల

By Ravi
On
సరస్వతినది పుష్కరాల పోస్టర్ విడుదల

తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుండి 26- వరకు జరగనున్న సరస్వతి నది పుష్కరాల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను అటవీ, పర్యావరణ,  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు.
ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ ఆవశక్యతని సూచిస్తూ తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అధికారిక పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ, నదులను పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు (SUP) నిషేదించడం, బట్టలు ఉతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహణ , నీటి కాలుష్యం  నుండి చర్మ వ్యాధులను నివారించడానికి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారుIMG-20250514-WA0053. ప్రజా రవాణాను ఉపయోగించడం వల్ల వాహన కాలుష్యం మరియు రద్దీ తగ్గుతుందని తెలిపారు. మనం సమిష్టి బాధ్యత తీసుకొని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి  పుష్కరాల పవిత్రతను కాపాడుకోవడానికి  చేతులు కలపాలని మంత్రి కొండా సురేఖ  అన్నారు.

Tags:

Advertisement

Latest News