భద్రాచలం దేవాలయంలో ప్రత్యేక పూజలు
By Ravi
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారతదేశంలో శాంతి స్థాపన కొరకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి మరింత విజయవంతం కావాలని భారతదేశము సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో ప్రత్యేకంగా గోపూజ. సుదర్శన హోమం స్వామివారికి అమ్మవారికి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరుపుతున్నామని దేశం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దేవస్థానం ఈవో రమాదేవి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు అర్చకులు పాల్గొన్నారు.
Tags:
Latest News
10 May 2025 19:20:42
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయితో కొందరు వ్యక్తులు ఉన్నారని సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బంది కలిసి రైల్వే స్టేషన్ సమీపంలో దాడులు...