కుత్బుల్లాపూర్ లో ఆపరేషన్ సింధూర్ వాక్
భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా సూరారంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు, హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దుల్లో దేశ క్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగ చాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్ కు సరైన గుణపాఠం తప్పదన్నారు. భారత సైనికులకు అండగా మేమందరం ఉంటామని ప్రతిజ్ఞ చేశారు హరీశ్ రావు.140 కోట్ల భారత ప్రజలకు అండగా దేశ సైనికుల పోరాటం చిరస్మరణీయమన్నారు. దేశం నుండి పాకిస్తాన్ విడిపినప్పటీ నుండి దొంగ చాటుగా దెబ్బలు తీయడం తప్ప,నేరుగా పోరాడే దైర్ఘ్యం లేదన్నారు. భారత దేశ ప్రజల కోసం అన్ని దేశాల మద్దతు ను కూడగట్టిన ప్రధానమంత్రి మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మల్లారెడ్డి వైద్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు