ఈ నెంబర్లకు కాల్ చేయండి
సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ పౌరుల కోసం, వారికి సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు రాష్ట్రాలలో ప్రస్తుతం నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సకాలంలో సహాయం, సమాచారం, సేవలను అందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. నిరంతరాయంగా సేవలను నిర్ధారించడానికి ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించింది. ఈ కంట్రోల్ రూమ్ కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ల్యాండ్లైన్: 011-23380556
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రటరీ & లైజన్ హెడ్ - 9871999044
హైదర్ అలీ నఖ్వీ, రెసిడెంట్ కమిషనర్ వ్యక్తిగత సహాయకుడు - 9971387500
జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ - 9643723157
సిహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ - 9949351270. ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా పైన పేర్కొన్న నెంబర్లలో సంప్రదించవచ్చని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు. తెలంగాణ పౌరుల భద్రత కోసం ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.