ఆపరేషన్ సింధూర్.. ఆల్విన్ కాలనీలో సంబరాలు

By Ravi
On
ఆపరేషన్ సింధూర్.. ఆల్విన్ కాలనీలో సంబరాలు

ఉగ్రవాదులు నిర్ములానే లక్షంగా భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన  దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్  ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గామ్ లో 10 రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్గా చేసుకొని దాడులు నిర్వహించిన ఉగ్రముకులకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధు పేరిట ఆరు చోట్ల భారత సైన్యం జరిపిన దాడులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని అన్నారు. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలని ఉద్దేశంతోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం చనిపోయిన వారికి తగిన నివాళి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మరోసారి ఉగ్రదాడి జరగాలంటే పాకిస్తాన్ కు భయం పుట్టేలా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న వాటిని సహకరిస్తామని అన్నారు.

Tags:

Advertisement

Latest News

బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని బడంగిపేట మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి బాలపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. కొద్దీ...
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...
భారత్‌, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ
బడంగిపేటలో బిఆర్ఎస్ భారీ ర్యాలీ