లారీలో పట్టుబడిన 30కేజీల గంజాయి.. ముగ్గురు అరెస్ట్
భద్రాచలం ఐటిసి కంపెనీ పార్కింగ్ యాడ్ లో లారీలోంచి 30 కేజీల గంజాయిని హైదరాబాద్ కు చెందిన ఎస్టి ఎఫ్ బి టీం ఎక్సైజ్ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఐటిసి పేపర్ మిల్లు కోసం అవసరమైన మూడు సరుకు కర్రను తీసుకు వస్తున్న లారీ డ్రైవర్ శివ ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొస్తున్న అర్జున్ ఎక్కించుకొని భద్రాచలం తీసుకువచ్చాడు. ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎస్టిఎఫ్ బి టీం ఎస్సై నాగరాజు మిగతా సభ్యులు కలిసి ఐ టి సి పార్కింగ్ యార్డులో నిలిచి ఉన్న లారీని తనిఖీలు చేయగా అందులో 30 కేజీల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. డ్రైవర్ శివ తో పాటు ఒరిస్సాకు చెందినటువంటి అర్జున్ గంజాయి వ్యాపారిని కలిసి పలుమార్లు ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకువచ్చి భద్రాచలంలో అమ్మకాలు చేపట్టినట్లు విచారణలో నిందితులు వెల్లడించారు. ఎప్పటి లాగానే ఈసారి కూడా తీసుకువచ్చినటువంటి గంజాయిని ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకోవడంతో గంజాయి అక్రమ రవాణాదారుల గుట్టురట్టు అయింది. పట్టుకున్న గంజాయి విలువ రూ. 15 లక్షలు, సీజ్ చేసినటువంటి లారీ విలువ 20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. డ్రైవర్ శివ గంజాయిని తీసుకొచ్చిన అర్జున్ మరో వ్యక్తి ప్రహ్లాదును గంజాయిని, లారీని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.
గంజాయి పట్టుకున్నటువంటి ఎస్టిఎఫ్ బీ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.వి. కమలహాసన్ రెడ్డి, బీ టీం ఇంచార్జ్ ప్రదీప్ రావులు అభినందించారు.