కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్

By Ravi
On
కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్

 హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి బెల్లంఆలం కారులో తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఎస్సై బాలరాజు టీం కలిసి హైదరాబాద్ శివారు బిఎన్ రెడ్డి కాలనీ సమీపంలో దాడి చేశారు.  కారులో తరలిస్తున్న 570 కేజీల బెల్లం,50  కేజీల ఆలం విలువ రూ. 62 వేలుగా ఉంటుందని గుర్తించారు. బెల్లాన్ని తరలిస్తున్నటువంటి కారుని సీజ్ చేశారు. ఈ బెల్లాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంబోతు తండాకు తరలిస్తున్నట్లు కారు డ్రైవర్ రాజు విచారణలో వెల్లడించాడు. ఈ కేసులో కారు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. బెల్లాన్ని పట్టుకున్నటువంటి టీమును ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం , టీం లీడర్ ప్రదీప్ రావు అభినందించారు.

Tags:

Advertisement

Latest News

ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్ ప్రజా సంబంధాలు మెరుగు పరుచుకోండి.. డీజీపీ జితేందర్
విధి నిర్వహణలో రానించేందుకు ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ అసిస్టెంట్ ఎస్పీలతో అన్నారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు,...
స్పెషల్ డ్రైవ్ స్టార్ట్.. పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం
మిస్ వరల్డ్ 2025 పోటీలకు సర్వం సిద్ధం
నిజాయితీగా నిలబడ్డ దివ్యాంగుడిని సన్మానించిన సీఐ శ్రీనాథ్
నల్లాలు ఉన్నాయి.. నీళ్లు రావు.. నిలదీసిన మహిళలు
పాతబస్తీలో దారుణం.. మహిళ గొంతుకోసి మృతదేహం తగలబెట్టిన దుండగులు
కార్ టైర్ మార్చేలోపు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి